Header Banner

భారత్ రక్షణశాఖ అధికారిక ప్రకటన! సీజ్ ఫైర్ పై క్లారిటీ..!

  Sun May 18, 2025 13:08        India

పహల్గామ్ లో పర్యాటకుల పైన ఉగ్ర మూక విచక్షణ రహితంగా మారణకాండ సృష్టించిన నేపథ్యంలో ఉగ్రవాదులను అణచివేయడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేసిన భారత్ దాదాపు 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించింది.


భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ నేటితో ముగుస్తుందా?
భారత్ దాడికి ప్రతీకార దాడులు చేస్తామని ప్రకటించిన పాక్ సరిహద్దులలో భారత్ పైన దాడులు చేయడానికి విఫలయత్నాలు చేసి చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. ఈ క్రమంలో సీజ్ ఫైర్ ప్రకటించింది భారత్. దీంతో ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.



ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

సీజ్ ఫైర్ పై క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ వర్గాలు

తాజాగా భారత రక్షణ శాఖ వర్గాలు దీనిపైన క్లారిటీ ఇచ్చాయి. నేటితో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు విరమణ ముగుస్తున్నట్టు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని వెల్లడించాయి. ఈనెల 10వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహన ప్రస్తుతం కొనసాగుతోందని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

 

సీజ్ ఫైర్ పై డీజీఎంవో చర్చల నిర్ణయమే కొనసాగుతుంది

అంతేకాదు నేడు జరగాల్సిన డిజిఎంవో చర్చల మీద కూడా క్లారిటీ ఇచ్చాయి. ఈరోజు ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశాయి. ఈనెల 10వ తేదీన జరిగిన డీజీఎంవో చర్చలలో నిర్ణయానికి కాలపరిమితి లేదని పేర్కొన్నారు. మే 10వ తేదీన రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OperationSindoor #IndianArmy #CounterTerrorism #SurgicalStrike #IndiaStrikesBack #TerrorFreeIndia